Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్ పర్యటనకు
- భారత జట్టు ఎంపిక
- మూడు ఫార్మెట్లకు కెప్టెన్గా కోహ్లి
- టెస్టు జట్టులో హనుమ విహారి
ముంబయి: వచ్చే నెల నుంచి జరగనున్న వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. మూడు ఫార్మెట్లకు కెప్టెన్గా కోహ్లి ప్రకటించారు. ప్రపంచకప్లో గాయంతో జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ మళ్లీ స్థానం దక్కించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు అవకాశం దక్కింది. టెస్టులకు వికెట్ కీపర్గా వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేశారు. జస్ప్రీత్ బుమ్రా టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉండగా హార్దిక్ పాండ్యకు పూర్తిగా విశ్రాం తి ఇచ్చారు. మూడు ఫార్మెట్లకు విడివిడిగా భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి కెప్టెన్ కోహ్లీతో సహా పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. విండీస్తో ఆగస్టు 3వ తేదీ నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల తో పాటు రెండు టెస్టులను టీమిండియా ఆడనున్న సంగతి తెలిసిం దే. ఇందులో రెండు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహిం చనున్నారు. కాగా, ఇంగ్లండ్లో ఇటీవల జరిగిన ప్రపంచకప్లో సెమీస్ నుంచి వైదొలిగిన తర్వాత కెప్టెన్ కోహ్లీ బీసీసీఐ అధికారుల తో సమావేశమవ్వడం ఇదే తొలిసారి. తొలుత కోహ్లీ ఈ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చినా విండీస్ పర్యటనకు అతనే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ప్రపంచకప్ ఓటమి నేపథ్యంలో ఇద్దరి కెప్టెన్ల ప్రతిపాదన వచ్చినప్పటికీ మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా విరాట్ కోహ్లినే ప్రకటించారు. అలాగే భారత జట్టును వేధిస్తున్న నాలుగో స్థానం సమస్య పరిష్కారం దిశగా సెలక్టర్లు ప్రయత్నం చేశారు. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలకు జట్టులో స్థానం కల్పించారు. భారత్-ఏ జట్టు తరఫున ప్రస్తుతం విండీస్ పర్యటన లోనే ఉన్న ఈ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. చతేశ్వర పుజారా, రవిచంద్రన్ అశ్విన్లకు టెస్ట్ జట్టులో స్థానం దక్కింది.
ఆదివారం ప్రకటించిన భారత టెస్టు జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారికి చోటు దక్కింది. కాకినాడకు చెందిన విహారి ప్రస్తుతం ఆంధ్రా రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెరియర్లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడిన హనుమ విహారి 167 పరుగులు చేశాడు. గత ఏడాది ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆడిన విహారి, ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కూడా ఎంపిక అయ్యాడు.
టీమిండియాలో అన్నదమ్ములు
టీమిండియా తరఫున మరో అన్నదమ్ముల జోడీ కలిసి బరిలోకి దిగనున్నారు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో సోదరులైన రాహుల్ చాహర్, దీపక్ చాహర్ స్థానం దక్కించుకున్నారు. ఐపిఎల్ ద్వారా రాహుల్, దీపక్లు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. 19 ఏళ్ల రాహుల్ చాహర్ ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్లో 13 వికెట్లను సాధించాడు. పొదుపుగా బౌలింగ్ చేయడం రాహుల్ ప్రత్యేకత. ఇక రాహుల్ చాహర్ అన్నయ్య దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలకమైన ఆటగాడు. తన పేస్తో జట్టుకు ఎన్నోవిజయాలను అందించాడు. వెస్టిండీస్ టీ20 సిరీస్లో తుదిజట్టులో వీరిద్దరికీ అవకాశం దక్కితే భారత్ తరఫున నాలుగో అన్నదమ్ముల జోడీగా రికార్డుకెక్కుతారు. గతంలో మోహిందర్ అమర్నాథ్-సురీందర్ అమర్నాథ్, ఇర్ఫాన్ పఠాన్-యూసఫ్ పఠాన్, హార్దిక్ పాండ్య-కృనాల్ పాండ్య సోదరులు టీమిండియా తరఫున ఆడారు.
విండీస్తో తలపడే భారత్ జట్టు
టీ20 జట్టు: విరాట్కోహ్లీ(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్అయ్యర్, మనీశ్పాండే, రిషభ్ పంత్(వికెట్కీపర్), కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్సైనీ.
వన్డే జట్టు: విరాట్కోహ్లీ(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్కెప్టెన్), శిఖర్ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్పాండే, రిషభ్పంత్(వికెట్కీపర్), రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్కుమార్, ఖలీల్అహ్మద్, నవదీప్సైనీ.
టెస్టు జట్టు: విరాట్కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రోహిత్శర్మ, రిషభ్పంత్(వికెట్కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్శర్మ, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్