Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దబంగ్ ఢిల్లీతో ఢీ
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ బోణీ కోసం ఎదురుచూస్తోంది. భారీ అంచనాల నడుమ సొంతగడ్డపై వేట మొదలు పెట్టిన టైటాన్స్కు తొలి రెండు మ్యాచుల్లోనే పరాభవమే ఎదురైంది. ఆరంభ మ్యాచ్లో యు ముంబా, తర్వాతి పోరులో తమిళ తలైవాస్ దెబ్బకొట్టింది. నేడు బలహీన జట్టు దబంగ్ ఢిల్లీపైనా బోణీ విజయం సాధించాలని టైటాన్స్ పట్టుదలగా కనిపిస్తోంది. బాహుబలి రైడర్ సిద్దార్థ్ దేశారుపై విపరీత అంచనాలతో టైటాన్స్ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందని అనిపిస్తోంది. అతడిపై అంచనాల భారం దించితే, సహజ శైలిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేసేందుకు వీలుంటుంది. వేలంలో రికార్డు ధర కూడా సిద్దార్థ్పై ఒత్తిడికి కారణమవుతోంది. రెండో మ్యాచ్లో టైటాన్స్, ఢిల్లీ తలపడనుండగా.. తొలి మ్యాచ్లో యూపీ యోధతో బెంగాల్ వారియర్స్ ఢీ కొట్టనుంది.