Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ క్రికెటర్ శుభ్మన్ గిల్
న్యూఢిల్లీ : ' ఆదివారం ప్రకటిం చిన భారత సీనియర్ జట్టు కోసం ఆసక్తిగా ఎదురు చూశాను. ఏదో ఒక జట్టులో చోటు దక్కుతుందని ఆశించాను. ఎంపిక కాకపోవటం నిరాశకు గురిచేసింది. దీనిపై ఆలోచించి సమయం వృథా చేసుకోను. నిలకడగా పరుగులు చేసి, సెలక్టర్ల మెప్పు పొందేందుకు ప్రయత్నం చేస్తాను' అని శుభ్మన్ గిల్ అన్నాడు. విండీస్-ఏపై నాలుగు మ్యాచుల్లో 54.50 సగటు, 98.19 స్ట్రయిక్ రేట్తో గిల్ 218 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఇదే పర్యటనలో 187 పరుగులు చేసిన శ్రేయాష్ అయ్యర్, 162 పరుగులు చేసిన మనీశ్ పాండేలకు జాతీయ జట్టులో చోటు లభించింది.