Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్తో టీ20లకు విండీస్ జట్టు
సెయింట్ జాన్స్ : కరీబియన్ టీ20 స్టార్స్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్లకు వెస్టిండీస్ టీ20 జట్టులో తిరిగి చోటు దక్కింది. భారత్తో జరిగే టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచులకు వెస్టిండీస్ మంగళవారం జట్టును ప్రకటించింది. ఆగస్టు 3, 4 తేదిల్లో ఫ్లోరిడా (అమెరికా)లో విండీస్, భారత్ తొలి రెండు టీ20లు ఆడనున్నాయి. 14 మందితో కూడిన విండీస్ బృందంలో విధ్వంసక సీనియర్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ లేడు. కెనడా టీ20 లీగ్లో ఆడేందుకు గేల్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గాయంతో ప్రపంచకప్కు దూరమైన ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ రెండేండ్ల విరామం తర్వాత విండీస్కు తొలి టీ20 ఆడనున్నాడు.
వెస్టిండీస్ టీ20 జట్టు : కార్లోస్ బ్రాత్వేట్ (కెప్టెన్), సునీల్ నరైన్, కీమో పాల్, కారీ పీరే, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, రోవ్మన్ పావెల్, ఆండ్రీ రసెల్, ఒసేన్ థామస్, ఆంటోని బ్రాంబ్లి, జాన్ కాంప్బెల్, షెల్డన్ కాట్రెల్, షిమ్రోన్ హెట్మయర్, ఎవిన్ లెవిస్.