Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ సమస్యతో సైనా దూరం
- జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్
టోక్యో : ఇటీవల పేలవ ప్రదర్శనతో నిలకడగా నిరాశపరుస్తున్న హైదరాబాదీ షట్లర్ బి. సాయిప్రణీత్ జపాన్లో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో అలవోక విజయం సాధించాడు. అన్సీడెడ్ సాయిప్రణీత్ 21-17, 21-13తో జపాన్ షట్లర్ కెంటో నిషిమోటపై వరుస గేముల్లో గెలుపొందాడు. 42 నిమిషాల తొలి రౌండ్ పోరులో సాయిప్రణీత్ మెరుగ్గా కనిపించాడు. నేడు రెండో రౌండ్లో జపాన్కే చెందిన కెంటా సునెయమతో సాయి తలపడనున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్, అశ్విని జంట 21-14, 21-19తో జర్మనీ జోడీపై శుభారంభం చేసింది. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీకి 12-21, 16-21తో వరుస గేముల్లో మలేషియా జంట చేతిలో ఓటమిపాలయ్యారు. స్టార్ షట్లర్లు పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్ నేడు టైటిల్ వేట మొదలెట్టనున్నారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్యలతో జపాన్ ఓపెన్ నుంచి వైదొలిగింది. వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ చాంపియన్షిప్స్పై సైనా మరింత దృష్టి సారించనుంది.