Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్ : జట్టు ర్యాంకింగ్స్లో భారత్, బ్యాటింగ్ జాబితాలో విరాట్ కోహ్లి అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. చివరగా ఆస్ట్రేలియాతో టెస్టులు ఆడిన భారత్, బోర్డర్ గవాస్కర్ సిరీస్ను 2-1తో గెల్చుకుని చరిత్ర సృష్టించింది. 922 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లి వరల్డ్ నం.1 బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 913 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (881) వరల్డ్ నం.3 బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. జట్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు టాప్-5లో వరుసగా నిలిచాయి. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే టాప్-10లో చోటుచేసుకున్నారు. జడేజా ఆరో స్థానంలో ఉండగా, అశ్విన్ పదో ర్యాంక్లో ఉన్నాడు. పాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ టాప్-3 బౌలర్లుగా నిలిచారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో ఉండగా.. జేసన్ హౌల్డర్ (వెస్టిండీస్), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.