Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలక్షన్ కమిటీ తీరు పట్ల గంగూలీ ఫైర్
కోల్కత : బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక తీరు పట్ల భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవటంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన దాదా, ఆటగాళ్లను సంతృప్తి పరిచే విధంగా సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటిస్తుందని విమర్శించారు. భారత్-ఏ తరఫున వెస్టిండీస్ పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన గిల్ను భారత జట్టుకు ఎంపిక చేయాల్సిందని గంగూలీ అన్నాడు. ' బలమైన జట్టు నిర్మాణం, నిలకడ, ఆత్మవిశ్వాసం కోసం సెలక్షన్ కమిటీ అన్ని ఫార్మాట్లకు ఒకే జట్టును ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది. ఇదేమీ ఆటగాళ్లు అందరికీ సంతృప్తి పరచటం కాదు. నిలకడైన ఫలితాల కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయటం' అని గంగూలీ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. అజింక్య రహానెను వన్డే జట్టుకు ఎంపిక చేయకపోవటం పట్ల గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే వెస్టిండీస్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించనున్నారు.