Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ కోచ్ ఎంపికపై సీఓఏ
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ కోచ్ను 1983 ప్రపంచకప్ విజయసారథి కపిల్ దేవ్ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేయనుంది. ఈ మేరకు పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు శుక్రవారం వెల్లడించారు. విరుద్ధ ప్రయోజ నాల వివాదంతో క్రికెట్ సలహా సంఘం (సీఓఏ) సభ్యులు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ పదవులను వదులుకున్నారు. మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ ఎంపిక కోసం కపిల్ దేవ్ సారథ్యంలో తాత్కాలిక కమిటీని నియమించారు. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ రంగస్వామి, మెన్స్ జట్టు మాజీ చీఫ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్లు కమిటీలోని ఇతర సభ్యులు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం క్రికెట్ సలహా సంఘాన్ని సర్వ సభ్య సమావేశంలో బోర్డు నియమించాలి. కపిల్ దేవ్, అన్షుమన్ గ్వైకాడ్ భారత క్రికెటర్ల సంఘం ఏర్పాటులోనూ సభ్యులు. దీంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ' కపిల్ దేవ్, రంగస్వామి, అన్షుమన్లతో కూడిన త్రి సభ్య కమిటీ చీఫ్ కోచ్ను ఎంపిక చేస్తుంది. ఇది తాత్కాలిక కమిటీ కాదు. విరుద్ధ ప్రయోజనాలపై కమిటీ సభ్యులు ప్రమాణ పత్రం ఇచ్చారు. ఆగస్టు మధ్యలో ఇంటర్వ్యూలో జరుగవచ్చు. కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ ప్రక్రియలో ఎటువంటి అభిప్రాయం లేదు. చీఫ్ కోచ్ ఎంపిక పూర్తిగా కపిల్ కమిటీ బాధ్యత' అని వినోద్ రారు తెలిపారు