Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఓపెన్
నవతెలంగాణ, హైదరాబాద్ : మహిళల డబుల్స్ భారత స్టార్ జోడీ అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి హైదరాబాద్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించారు. బిడబ్ల్యూఎఫ్ హైదరాబాద్ ఓపెన్ టైటిల్ విజయానికి సిక్కి జోడీ అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21-12, 21-12తో సిక్కి, అశ్విని విజయం సాధించారు. హాంగ్కాంగ్ జంట ఫన్ కా యన్, వు యి తింగ్ వరుస గేముల్లో చేతులెత్తేసింది. దూకుడుగా ఆడిన సిక్కి, అశ్విని ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే టైటిల్ పోరులో కొరియా జోడీతో సిక్కి, అశ్విని పోటీపడను న్నారు. పురుషుల సింగిల్స్లో సౌరవ్ వర్మ ఫైనల్లోకి ప్రవేశించాడు. 32-21, 21-16తో మలేషియా షట్లర్ ఇస్కందర్పై వర్మ విజయం సాధించాడు.