Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారు కేంద్రాలకు నియామకం
న్యూఢిల్లీ : కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సారు) కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్, జూనియర్ స్థాయి అథ్లెట్లకు భిన్నమైన ఆహారం అందించటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి కిరణ్ రిజ్జు.. అందరికీ ఒకే ఆహారం అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సారు కేంద్రాలకు వృత్తి నిపుణులైన పౌష్ఠికాహార నిపుణులు, వంటవాళ్లను నియమించేందుకు రంగం సిద్ధమైంది. సారు కేంద్రాల్లో భిన్న క్రీడల్లో పోటీపడే అథ్లెట్లు ఉంటారు. అందరికీ ఒకే మెనూ, ఆహారం అందించటంతో అథ్లెట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఒక్కో అథ్లెట్కు అవసరమైన మెనూ ప్రత్యేకంగా అందించనున్నారు. అథ్లెట్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆహారం అందించేందుకు నైపుణ్యం కలిగిన వంటగాళ్లను నియమించనుంది. న్యూట్రిషయన్లకు, చెఫ్లకు రూ. 1 లక్ష వేతనం ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఢిల్లీ, పటియాల, బెంగళూర్, తిరువనంతపురం, కోల్కత, భోపాల్, గాంధీనగర్, లక్నో, ఇంపాల్, గౌహతి, ముంబయి, సోనెపట్, ఔరంగబాద్, రోహతక్, అల్లెప్పె సారు కేంద్రాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కిచెన్లను పర్యవేక్షించేందుకు కొత్తగా మేనేజర్లను సైతం సారు తీసుకోనుంది.