Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ఆలోచనకు బీసీసీఐ వ్యతిరేకం
ముంబయి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆలోచనలను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మరోసారి గట్టిగా వ్యతిరేకించింది. ఐసీసీ 2016 వరల్డ్ టీ20కి పన్ను మినహాయింపు అంశంలో ఇప్పటికే బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో దేశవాళీ షెడ్యూల్ క్రమబద్దీకరణ, ఐసీసీ అనుమతి తప్పనిసరి అంటూ వరల్డ్ బాడీ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా రంజీ ట్రోఫీ, విజరు హజారే ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ షెడ్యూల్కు ఐసీసీ అనుమతి అక్కర్లేదని బీసీసీఐ వాదించింది. సొంత క్రికెట్ బోర్డు టీ20 లీగ్, ఇతర బోర్డులు నిర్వహించే టీ20ల్లో ఒక దానిలో ఆడాలనే నిబంధనను ఐసీసీ తీసుకొచ్చింది. దీనిపైనా బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బీసీసీఐకు బాసటగా నిలిచాయి. వెస్టిం డీస్ వంటి బోర్డులు ఆటగాళ్లకు మెరుగైన కాంట్రాక్టు ఇవ్వ టం లేదు. టీ20 లీగ్ల్లో ప్రాతినిథ్యంపై పరిధి విధిస్తే, క్రికెట ర్లు త్వరగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ప్రమాదం ఉందని బీసీసీఐ వ్యాఖ్యానించింది. ఈ నిబంధనతో ఐపీఎల్ షెడ్యూల్పై ఐసీసీ పెత్తనం చెలాయించే అవకాశం ఇవ్వబోమని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.