Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రేయాష్ అయ్యర్ అర్ధ సెంచరీ
- వెస్టిండీస్తో తొలి వన్డే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్) : పరుగుల యంత్రం, క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి రికార్డుల యాత్ర కొనసాగుతోంది. ప్రపంచకప్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు బాదిన విరాట్, తాజాగా వెస్టిండీస్పై రెండో వన్డేలో అదిరే శతకం సాధించాడు. 112 బంతుల్లో వంద మార్క్ చేరుకున్న విరాట్ కోహ్లి (120, 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో 42వ సెంచరీ నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డుకు చేరువైన కోహ్లి.. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా సౌరవ్ గంగూలీని వెనక్కి నెట్టాడు. గంగూలీ 311 మ్యాచుల్లో 11,363 పరుగులు చేయగా.. కోహ్లి 238వ వన్డేలోనే దాదాను దాటేశాడు. వెస్టిండీస్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా జావెద్ మియాందాద్ (పాకిస్థాన్) 26 ఏండ్ల రికార్డునూ బద్దలు కొట్టాడు. మియాందాద్ విండీస్పై 64 ఇన్నింగ్స్ల్లో 1930 పరుగులు చేయగా.. కోహ్లి 34వ ఇన్నింగ్స్లోనే 2000 ప్లస్ పరుగులు కొట్టా డు. ఓ జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో (34) 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (37 ఇన్నింగ్స్లు, ఆస్ట్రే లియాపై)ను అధిగ మించాడు. విరాట్ కోహ్లి క్లాసికల్ ఇన్నింగ్స్తో మెరిసిన రెండో వన్డేలో, శ్రేయాష్ అయ్యర్ (58 నాటౌట్, 55 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆటకు వరుణుడు అంతరాయం కలిగించే సమయానికి భారత్ 42.2 ఓవర్లలో 233/4 పరుగులు చేసింది.
టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (2) ఇన్నింగ్స్ మూడో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (18)తో జట్టుకట్టిన కెప్టెన్ కోహ్లి (120) రెండో వికెట్కు 74 పరుగులు జోడించాడు. స్పిన్నర్ ఛేజ్పై భారీ షాట్కు వెళ్లి రోహిత్ వికెట్ కోల్పోగా.. దూకుడుగా ఆరంభించిన రిషబ్ పంత్ (20) వికెట్ నిలుపుకోలేదు. శ్రేయాష్ అయ్యర్ ఆకట్టుకునే అర్ధ సెంచరీ సాధించాడు. కోహ్లితో కలిసి శతక భాగస్వామ్యం నమోదు చేసిన అయ్యర్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ ఆటగాడు క్రిస్ గేల్కు ఇది 300వ వన్డే. ఈ మ్యాచ్తో కరీబియన్ జట్టు తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా గేల్ నిలిచాడు.