Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వన్డేల్లో కనీసం 75-80 సెంచరీలు చేస్తాడని, టెస్టుల్లో, వన్డేల్లో కలిపి ఏకంగా వంద సెంచరీలు నమోదు చేయడం ఖాయ మని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే పూర్తి చేశాడు. ఆ ఫీట్ను విరాట్ త్వరలోనే చేరుకుంటాడని అభిప్రాయపడ్డాడు. విండీస్తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ శతకం. విరాట్ శతకం కావడం విశేషం. టెస్టుల్లో కోహ్లీ ఇప్పటికే 25 సెంచరీలను నమోదు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఇప్పటివరకు 67 సెంచరీలతో సచిన్ తర్వాత కొనసాగుతున్నాడు.