Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రాహుల్ ద్రవిడ్పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసును క్రికెట్ పాలకుల కమిటీ(సీిఓఏ) మంగళవారం క్లియర్ చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీిఏ) క్రికెట్ హెడ్ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బిసిసిఐ అంబుడ్స్మన్ డికె జైన్ కోర్టులో ఉందని సీిఓఏ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రవి తొగ్డె అన్నారు. భారత్-ఏ, అండర్-19 కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ను ఎన్సీిఏ క్రికెట్ హెడ్గా నియమించారు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాని ఎన్.శ్రీనివాసన్కు చెందిన ఇండియా సిమెంట్స్లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ద్రవిడ్కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసులు పంపించారు. భారత క్రికెట్లో అత్యంత గౌరవించే అతడికి నోటీసులు ఇవ్వడంతో గంగూలీ సహా ఇతర క్రికెటర్లు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సీిఓఏ సమావేశానికి ముందే డీకే జైన్కు ద్రవిడ్ తన వివరణ పంపించారు.