Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీల్ సుబ్రమణియంను వెనక్కి పలిపించిన బీసీసీఐ
ముంబయి: భారత క్రికెట్ జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియంపై బీసీసీఐ ఎట్టకేలకు వేటు వేసింది!. కరీబియన్ దీవుల్లోని భారత హై కమిషన్ అధికారితో దురుసుగా ప్రవర్తించిన సునీల్పై పాలకుల కమిటీ (సీఓఏ) తీవ్ర నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ పర్యటన నుంచి తక్షణమే వెనక్కి రావాలని ఆదేశించింది. చీఫ్ కోచ్ రవిశాస్త్రి బృందంతో సహా 45 రోజుల కాంట్రాక్టు పొడగింపు పొందిన సునీల్ సుబ్రమణియం, త్వరలోనే జరుగనున్న ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం సైతం కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు సందర్భంగా సీఏ కిచెన్ సిబ్బందిని సునీల్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. కోహ్లిసేన చారిత్రక విజయంతో ఆ వివాదం మరుగునపడింది.
' నీటి సంరక్షణ' ప్రచారం కోసం కరీబి యన్ దీవుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో వీడియో చిత్రీకరించా లని ఆదేశించింది. ఈ మేరకు గయాన, ట్రినిడాడ్ సహా అక్కడి భారత హై కమిషన్కు సమాచారం అందించింది. జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణియంతో తదుపరి వివరాల కోసం సంప్రదించాల్సిందిగా ఇరు దేశాల హై కమిషన్ అధికారులకు సూచించింది. ఈ విషయమై భారత హైకమిషన్లోని ఉన్నతాధి కారి సునీల్ను సంప్రదించగా.. అతడు దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ విషయం ఆ అధికారి ఢిల్లీకి చేరవేయగా, వివాదం సీఓఏ చైర్మన్ వినోద్ రారు తలుపు తట్టింది. భారత దేశ ప్రతినిధిగా బాధ్యతాయుత స్థానంలో విదేశీ పర్యటనలో కొనసాగుతూ.. పని ఒత్తిడిని కారణంగా చూపటం బాధ్య తారాహిత్యమని పాలకుల కమిటీ భావించింది. తక్షణమే స్వదేశానికి రావాల్సిందిగా సునీల్ను ఆదేశించింది. ప్రపంచకప్లోనూ సునీల్ ప్రవర్తన సరిగా లేదని బీసీసీఐ అధికారులు ఫిర్యాదు చేశారు. సన్నిహితులకు టికెట్ల కోసం వెంపర్లాడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. స్వదేశం చేరుకున్న తర్వాత పాలకుల కమిటీ ముందు సునీల్ హాజరయ్యే అవకాశం ఉంది.