Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్నాపై ఉత్కంఠ విజయం
- ప్రొ కబడ్డీ లీగ్ 7
అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్ల పోరులో యు ముంబా మెరిసింది. మూడు సార్లు విజేత పట్నా పైరేట్స్ను సాధికారిక విజయం నమోదు చేసింది. 9-22తో భారీ వెనుకంజలో నిలిచిన పట్నా ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. సెకండ్ హాఫ్లో యు ముంబాను ఆలౌట్ చేసి స్కోరు సమం చేసేందుకు గట్టి పోటీనిచ్చింది. ఆఖరు రైడ్లో రోహిత్ బలియన్ను అవుట్ చేసి టై చేసుకుందామని ఆశించిన పట్నాకు భంగపాటు తప్పలేదు. ఆఖరి రైడ్లో రోహిత్ మూడు పాయింట్లతో ముంబయికి 34-29తో ఐదు పాయింట్ల విజయాన్ని అందించాడు. పీకెఎల్లో 1600 రైడ్లతో రికార్డు నెలకొల్పిన పర్దీప్ నర్వాల్ కేవలం 6 పాయింట్లే సాధించాడు. మహ్మద్ 6, జంగ్ కున్ లీ 3, హాది 3 మెరిశారు. యు ముంబా రైడర్ రోహిత్ బలియన్ 9 పాయింట్లతో అదరగొట్టాడు. అతుల్ 8, సందీప్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు.