Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్-ఏతో వార్మప్ మ్యాచ్
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా) : సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టు తరఫన బరిలోకి దిగిన అజింక్య రహానె తొలి ఇన్నింగ్స్లో 1 పరుగుకే అవుటై నిరాశపరి చాడు. రహానెకు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా పంపించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రహానె (54) అర్థ సెంచరీతో రాణించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో అర్ధ సెంచరీ సాధించిన రహానె తొలి టెస్టుకు ముందు ఆత్మవిశ్వాసం సాధిం చాడు. తెలుగు కుర్రాడు హనుమ విహారి (64, 125 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో అజేయ 37 పరుగులు చేసిన విహారి ఫిఫ్టీ ప్లస్తో మెరిశాడు. మయాంక్ అగర్వాల్ (13), రిషబ్ పంత్ (19), రవీంద్ర జడేజా (9) నిరాశపరిచారు. మూడో రోజు లంచ్ సమయా నికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 174/5తో కొనసాగుతోంది. అశ్విన్ (5), సాహా (6) ఆడుతున్నారు.
అంతకముందు వెస్టిండీస్-ఏ 181 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టారు.