Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్
ప్రమాదంలో ఓ కాలు, చేయి కోల్పోవాల్సి వచ్చింది. పుట్టుకతో వచ్చిన వైకల్యం కంటే ప్రమాదశావత్తూ సంభవించిన వైకల్యం సాధారణ జీవనాన్ని మరింత దుర్బరం చేస్తుంది. రోజు పనులు చేసుకోవటమే ఇబ్బంది అని భావించిన వారి అంచనాలను అతడు తలకిందులు చేశాడు. మొబైల్ రిపేర్ నిపుణుడిగా, సైక్లింగ్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి 68 రోజుల్లో ముగించి అందరి దృష్టిని ఆకర్షించిన శేఖర్ గౌడ్.. తాజాగా దక్షిణ రష్యాలోని ఎత్తైన పర్వతం ఎల్బ్రస్ను అధిరోహించాడు. ఓ కాలు, మరో చేయి లేకుండా ఈ ఘనత సాధించిన తొలి భారత పర్వతారోహకుడిగా రికార్డు సృష్టించాడు. బూట్స్ అండ్ క్రాంపన్స్ సంస్థ మార్గనిర్దేశనంతో మరో ఆరుగురు పర్వాతారోహకులతో కలిసి శేఖర్ గౌడ్ రష్యాలోని ఎత్తైన పర్వతాన్ని చేరుకున్నాడు. సాధించాలనే సంకల్పం ముందు అంగ వైకల్యం అడ్డు కాదని నిరూపించిన శేఖర్ గౌడ్ను, ఇతర పర్వతారోహకులను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు. సోమవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పర్వతారోహకులకు సీపీ మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పర్వతారోహకులు ఆశా, మహిపాల్, సతీశ్, అరుణ్ కుమార్, మేఘ (మధ్యప్రదేశ్) సహా బూట్స్ అండ్ క్రాంపన్స్ వ్యవస్థాపకులు టి. భరత్ పాల్గొన్నారు.