Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యు ముంబాపై 30-27తో గెలుపు
- ప్రొ కబడ్డీ లీగ్ 7
చెన్నై : తెలుగు టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిన హర్యానా స్టీలర్స్ వేగంగా పుంజుకుంది. చెన్నైలో నెహ్రా ఇండోర్ స్టేడియంలో సోమవారం యు ముంబాతో మ్యాచ్లో స్టీలర్స్ విన్నర్స్గా నిలిచింది. 30-27తో మూడు పాయింట్ల తేడాతో గెలుపు దారిలోకి వచ్చింది. ప్రథమార్థంలోనే 16-8తో భారీ ఆధిక్యంలో నిలిచిన హర్యానా సెకండ్ హాఫ్లో కాస్త నెమ్మదించింది. ప్రతి దశలోనూ ముందంజలోనే నిలిచిన హర్యానా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. స్టీలర్స్ రైడర్ వికాశ్ 9 పాయింట్లు తీసుకురాగా, డిఫెండర్లు రవి కుమార్, సునీల్ చెరో మూడు ట్యాకిల్స్ చేశారు. చందూ సింగ్ ఓ సూపర్ ట్యాకిల్ సహా మూడు పాయింట్లు సాధించాడు. యు ముంబా తరఫున సందీప్ నర్వాల్ (5), ఫజల్ (4), అర్జున్ (3), అతుల్ (3) పోరాడారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్పై 31-24తో యూపీ యోధ విజయం సాధించింది. పీకెఎల్లో మంగళవారం విరామ రోజు. నేడు మ్యాచులు లేవు.