Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్
బసెల్ : బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లు బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్లో వరల్డ్ నం.19 సాయిప్రణీత్ 21-17, 21-16తో తొలి రౌండ్లో అంటోని (కెనడా)పై అలవోక విజయం సాధించాడు. వరల్డ్ నం.30 హెచ్.ఎస్ ప్రణరు 17-21, 21-10, 21-11తో ఫిన్లాండ్ ఆటగాడిపై పోరాడి గెలిచాడు. మహిళల డబుల్స్లో మేఘన జక్కంపూడి, పూర్విశ జోడీ 21-10, 21-18తో ముందంజ వేసింది. మహిళల సింగిల్స్లో పి.వి సింధు, సైనా నెహ్వాల్లకు తొలి రౌండ్లో బై లభించింది.