Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అంబుడ్స్మన్ ఆదేశం
న్యూఢిల్లీ : కళంకిత భారత క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు ఊరట లభించింది!. 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ క్రమశిక్షణ సంఘం శ్రీశాంత్ సహా రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండిలా, అంకిత్ చౌవాన్లపై జీవిత కాల నిషేధం విధించింది. బీసీసీఐ సమూల సంస్కరణలకు తక్షణ కారణమైన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో బీసీసీఐ నిషేధం ఎత్తివేయాలని శ్రీశాంత్ న్యాయ పోరాటం చేశాడు. న్యాయ చట్టాల ప్రకారం శ్రీశాంత్ నిర్దోషి అయినా, బీసీసీఐ క్రమశిక్షణ నియా మవళిని ఉల్లంఘించినందుకు నిషేధం కొనసాగుతుందని బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ కేరళ హైకోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన శ్రీశాంత్, నిషేధంపై బోర్డు పున పరిశీలన చేసేలా ఆదేశం తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టు సూచనతో బోర్డు అంబుడ్స్మన్ శ్రీశాంత్ నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేండ్లకు కుదించాడు. ' శ్రీశాంత్ వయసు 40కి చేరువవుతోంది.
క్రికెటర్గా, ప్రత్యేకించి ఫాస్ట్ బౌలర్ ప్రధాన కాలం ముగిసిపోయింది. శ్రీశాంత్ ఏదేని కమర్షియల్ క్రికెట్, బీసీసీఐ కార్యకలా పాల్లో పాల్గొనేందుకు ఏడేండ్ల నిషేధం విధిస్తున్నాను. ఇది 13.09. 2013 నుంచి అమల్లోకి వస్తుంది' అని జస్టిస్ డికె జైన్ వెల్లడించారు. 2020 సెప్టెంబర్లో శ్రీశాంత్ నిషేధం కాలం ముగుస్తుంది. కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.