Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఓపెనర్ వీరెందర్ సెహ్వాగ్
న్యూఢిల్లీ : ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొదించగల సామర్థ్యం ఉన్న భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను చీఫ్ సెలక్టర్గా చూడాలని ఉందని వీరెందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'సెలక్టర్' యాప్ ఆవిష్కరించిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి అనల్ కుంబ్లే సరైన వ్యక్తిగా నా అభిప్రాయం. ఆటగాడిగా సచిన్, గంగూలీ, ద్రవిడ్తో.. కోచ్గా యువ క్రికెటర్లతో అనుబంధం కలిగిన వ్యక్తి కుంబ్లే. 2007-08 ఆస్ట్రేలియా సిరీస్కు నేను జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు కుంబ్లే నా గదికి వచ్చాడు. వచ్చే రెండు సిరీస్లకు నీపై వేటు ఉండదు అని చెప్పాడు. ఓ ఆటగాడికి అటువంటి విశ్వాసం అవసరం' అని వీరూ పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్కు ఏడాదికి రూ. 1 కోటి వేతనంగా ఇస్తున్నారు. అనిల్ కుంబ్లేను చీఫ్ సెలక్టర్గా కావాలని కోరుకుంటే ముందు బీసీసీఐ వేతన సవరణ చేయాలి. ఆకర్షణీయమైన వేతనం అందిస్తే చాలా మంది క్రికెటర్లు సెలక్షన్ కమిటీపై ఆసక్తి చూపిస్తారని వీరూ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్టులో ఐదుగురు బౌలర్లతో ఆడితే రహానె తుది జట్టులో ఉండాలని, నలుగురు బౌలర్లతో ఆడినప్పుడే రోహిత్ శర్మ రేసులోకి వస్తాడని వీరూ అభిప్రాయం వ్యక్తపరిచాడు.