Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26-28తో జైపూర్ చేతిలో ఓటమి
చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్ 7లో సొంతగడ్డపై మరో జట్టు విజయానికి నోచుకోవటం లేదు. చెన్నై వేదికగా తమిళ తలైవాస్ వరుసగా మూడో మ్యాచ్లో గెలుపు గీత దాటలేదు. జైపూర్ పింక్ పాంథర్స్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తమిళ తలైవాస్ 26-28తో ఓటమి పాలైంది. విరామ సమయానికి 11-13తో రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్.. ద్వితీయార్థంలోనూ ఆ రెండు పాయింట్లను అధిగమించలేదు. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 16 సార్లు కూతకెళ్లి ఆరు పాయింట్లే సాధించాడు. అజరు ఠాకూర్ 15 రైడ్లలో ఆరు పాయింట్లు తీసుకొచ్చాడు. డిఫెన్స్లో వినీత్ శర్మ (5), మోహిత్ చిల్లార్ (3) రాణించగా తలైవాస్ విజయంపై కన్నేసింది. 22-26, 24-26తో రేసులోకి వచ్చినా ఒత్తిడిలో పాయింట్లు సాధించలేదు. పాంథర్స్ తరఫున నీలేశ్ (7), విశాల్ (4), దీపక్ హుడా (3), దీపక్ నర్వాల్ (3) రాణించారు. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్పై పుణెరి పల్టన్ 31-23తో గెలుపొందింది.