Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వెస్టిండీస్తో రెండో టెస్టులో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి పేర్కొన్నాడు. ' ఫీల్డింగ్లో అత్యంత క్లిష్టమైన స్థానం వికెట్ కీపింగ్. గ్లోవ్స్ వేసుకున్న ప్రతి ఒక్కరు వికెట్ కీపింగ్ చేయలేరు. రిషబ్ పంత్కు మంచి ప్రతిభ ఉంది. అతడిని సానబట్టాలి. సాహాకు గాయాలవటం బాధాకరం. అతడికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. తుది జట్టులో చోటు దక్కనప్పుడు, అతడిని జట్టులోకి ఎంపిక చేసి ఏం లాభం? అని కిర్మాణీ ప్రశ్నించాడు. ఎం.ఎస్ ధోని రిటైర్మెంట్పై చర్చించటం మంచిది కాదని కిర్మాణీ అన్నాడు.
టాప్-10లో బుమ్రా : ఆంటిగ్వా టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి వచ్చాడు. బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. కోహ్లి నం.1గా కొనసాగుతుండగా, స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ 13వ స్థానానికి ఎగబాకాడు. జట్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ొ మాజీ క్రికెటర్ కిర్మాణీ