Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
ముంబయి : 2019 ప్రపంచకప్ విజయంతో ఘనంగా వీడ్కోలు తీసుకుందామని అనుకున్న ఎం.ఎస్ ధోని, సెమీఫైనల్స్ నిష్క్రమణ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా అనే ఆసక్తికి తెరదీశాడు. వెస్టిండీస్కు సిరీస్కు అందుబాటులో లేకుండా, సైనిక విధులు నిర్వహించిన మహి.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ధోని భవితవ్యంపై మళ్లీ చర్చ మొదలైంది. బీసీసీఐ తరఫున ఉన్నతాధికారులు ఎవరూ మహిని సంప్రదించలేదని, సెలక్షన్ కమిటీ సైతం ఆ పని చేసేందుకు సిద్ధంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ధోని 2020 టీ20 ప్రపంచకప్ ఆడాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్తోనే ప్రపంచకప్కు వెళ్లాలని సెలక్షన్ కమిటీ నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎం.ఎస్ ధోనిని ఎంపిక చేసే అవకాశం లేదని చెప్పవచ్చు. వరల్డ్కప్కు ముందు భారత్ కేవలం 22 టీ20లే ఆడాల్సి ఉంది. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లకు అవకాశాలు ఇవ్వటంపై సెలక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది. వన్డే జట్టుకు ధోని ఎంపికయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సంచలన నిర్ణయాలు వెలువరించే ధోని దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు లేదా సిరీస్ మధ్యలోనే వీడ్కోలు ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు!.