Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ కబడ్డీ లీగ్ 7
న్యూఢిల్లీ : స్టార్ రైడర్ రాహుల్ చౌదరి పేలవ ప్రదర్శన కొనసాగుతుండగా, తమిళ తలైవాస్ పరాజయాల బాట వీడటం లేదు. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 11 పాయింట్లతో రాణించినా, తమిళ తలైవాస్కు ఓటమి తప్పలేదు. జోరు మీదున్న బెంగాల్ వారియర్స్ 35-26తో 9 పాయింట్ల తేడాతో తలైవాస్ను చిత్తు చేసింది. రైడర్ ప్రపంజన్ 10 పాయింట్లతో చెలరేగగా, మణిందర్ సింగ్ 9 పాయింట్లతో రాణించాడు. డిఫెండర్ రింకూ సింగ్ ఐదు ట్యాకిల్స్తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఒక్క పాయింట్ మాత్రమే సాధించాడు. పీకెఎల్7లో నేడు తెలుగు టైటాన్స్తో పుణె పల్టన్ తలపడనుంది. ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టిన టైటాన్స్ మెరుగైన ప్రదర్శన చేయటంపై దృష్టి పెట్టనుంది.