Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
ముంబయి : భారత క్రికెట్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ ఫీనిషర్ మహేంద్రసింగ్ ధోనికి సీనియర్ సెలక్షన్ కమిటీ షాకిచ్చింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత ధోని వీడ్కోలు ప్రకటన చేస్తాడనే ఊహాగానాలు చెలరేగాయి. రెండు నెలల విరామం కోరిన ధోని, సైనిక వీధుల్లో చేరాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు మహి అందుబాటులో ఉన్నాడు. 2020 టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైపే మొగ్గింది. ప్రపంచకప్ తర్వాత విరామం తీసుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్కు సెలక్టర్లు ఉద్వాసన పలికారు!. స్టార్ పేసర్ జశ్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించింది. సెప్టెంబర్ 15న ధర్మశాల టీ20తో భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభం కానుంది. గురువారం ముంబయిలోకి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ భారత టీ20 జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్ జరుగుతున్న సమయంలో వన్డే జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే జట్టుకూ మహి ఎంపికవకపోతే, భారత క్రికెట్ జట్టు తరఫున ధోని ఆట ముగిసినట్టే భావించాలి!.
భారత టీ20 జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైని.