Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విజయంపై కోహ్లిసేన గురి
- వెస్టిండీస్తో రెండో టెస్టు నేటి నుంచి
- రాత్రి 8 నుంచి సోనీటెన్లో..
కింగ్స్టన్ (జమైకా)
కరీబియన్ పర్యటన క్లీన్స్వీప్పై కోహ్లిసేన గురి పెట్టింది. టీ20, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా టెస్టు సిరీస్నూ సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నార్త్సౌండ్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ 1-0తో సిరీస్లో ముందుంది. కింగ్స్టన్లో నేడు విండీస్, భారత్ రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ప్రదర్శన, తాజా ఫామ్తో కోహ్లిసేన కింగ్స్టన్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నార్త్సౌండ్లో బంతితో, బ్యాట్తో మంచి అవకాశాలు లభించినా కరీబియన్ జట్టు సద్వినియోగం చేసుకోవటంలో విఫలమైంది. ప్రతిభావంతులతో కూడిన విండీస్ ఊరట విజయం కోసం ఎదురుచూస్తోంది. భారత్తో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ విండీస్ విజయానికి నోచుకోలేదు. జమైకాలో జరుగుతున్న ఈ టెస్టు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.
రోహిత్కు నో ఛాన్స్ : తొలి టెస్టుకు ముందు రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు ఇవ్వాలా? వద్దా? అనే చర్చ సాగింది. రోహిత్ పోటీదారులు రహానె, విహారి ఆంటిగ్వాలో అదిరే ప్రదర్శన చేశారు. దీంతో రోహిత్ శర్మకు తుది జట్టులో అవకాశం లేదనే చెప్పాలి. ఐదు రోజుల ఆట ఆడేందుకు రోహిత్ స్వదేశంలో సఫారీతో సిరీస్ వరకూ వేచిచూడాల్సిందే. వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ఒత్తిడి పెరుగుతోంది. టీ20, వన్డే జట్టులో పంత్ స్థానంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ టెస్టుల్లో బ్యాటింగ్ నైపుణ్యం కంటే వికెట్ కీపింగ్ ప్రతిభ ప్రధానం. సాహాను బెంచ్పై ఉంచుకుని, వికెట్ల వెనకాల పంత్ ఎంతోకాలం సాదాసీదా వికెట్ కీపింగ్ చేయలేడు. జట్టు మేనేజ్మెంట్ పంత్కు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతుంది. మెరుగైన వికెట్ కీపింగ్ కనబరచని వేళ, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కైనా సాహాకు స్థానం కోల్పోక తప్పదు!. బ్యాటింగ్ లైనప్లో రాహుల్ ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. మయాంగ్ అగర్వాల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం తనదైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. టెస్టు స్పెషలిస్ట్ పుజార తన ముద్ర వేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, షమి, ఇషాంత్ త్రయం మెరుపులు కొనసాగనున్నాయి. స్పిన్నర్గా రవీంద్ర జడేజాతోనే కోహ్లి వెళ్లనున్నాడు.
ఊరట దక్కునా? : టీ20, వన్డే, టెస్టుల్లో విజయమే దక్కని విండీస్ చివరకు కింగ్స్టన్లోనైనా ఓదార్పు దక్కించుకోవాలని చూస్తుంది. కరీబియన్ బౌలింగ్ విభాగం బాగుంది. హౌల్డర్, కీమర్ రోచ్, గాబ్రియల్, కీమో పాల్ ప్రమాదకర సీమర్లు. కానీ బ్యాటింగ్ లైనప్ అవసరమైన పరుగులు చేయటం లేదు. హెట్యమర్, హౌప్, ఛేజ్, కాంప్బెల్ రూపంలో ప్రతిభావంతులు ఉన్నప్పటికీ సమష్టిగా రాణించటంలో విఫలమవుతున్నారు.
27:
కెప్టెన్గా విరాట్ కోహ్లి టెస్టు విజయాలు. ఎం.ఎస్ ధోని రికార్డును అధిగమించేందుకు విరాట్ ఓ విజయం దూరంలో ఉన్నాడు. జమైకా టెస్టు నెగ్గితే టెస్టుల్లో భారత్ విజయవంతమైన కెప్టెన్గా కోహ్లి నిలువనున్నాడు. 47 టెస్టుల్లో కోహ్లి 27 గెలిచాడు. పది డ్రా కాగా, మరో పది ఓటమిపాలయ్యాడు.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ : క్రెయిగ్ బ్రాత్వేట్, జాన్ కాంప్బెల్, సమర బ్రూక్స్, డారెన్ బ్రావో, రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్మయర్, షేన్ డావ్రిచ్, జేసన్ హౌల్డర్, షానన్ గాబ్రియల్, కీమో పాల్, కీమర్ రోచ్.