Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ : తొలిసారి పారా అథ్లెట్ (మహిళ) భారత్ అత్యున్నత క్రీడా పురస్కారం లభించింది. రియో పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన దీప మాలిక్ (షాట్ఫుట్, ఎఫ్53 విభాగం) రాజీవ్గాంధీ ఖేల్రత్న పురస్కారం అందుకుంది. జావెలిన్ త్రోలో ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన దీప మాలిక్.. 36 ఏండ్ల వయసులో ఖేల్రత్న అందుకుని మరో రికార్డు సృష్టించారు. జాతీయ క్రీడా దినోత్సవం (హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా గురువారం రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా దీప మాలిక్ ఖేల్రత్న పురస్కార పతకం, ప్రశాంస పత్రం, రూ.10 లక్షల చెక్ అందుకుంది. ఖేల్రత్న అవార్డుకు ఎంపికైన స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా వరల్డ్ చాంపియన్షిప్స్ సన్నాహాకాల్లో రష్యాలో బిజీగా ఉండటంతో, అవార్డుల వేడుకకు హాజరు కాలేదు.
తెలుగు కుర్రాడు, ప్రపంచ చాంపియన్షప్స్లో కాంస్యం సాధించిన బి. సాయిప్రణీత్ అర్జున అవార్డును అందుకున్నాడు. క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ కెప్టెన్ ఠాకూర్లు అర్జున అవార్డులు స్వీకరించారు. బ్యాడ్మింటన్ కోచ్ విమల్ కుమార్ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు.