Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27-34తో పుణె చేతిలో ఓటమి
- జోరు తగ్గని దబంగ్ ఢిల్లీ
- ప్రొ కబడ్డీ లీగ్ 7
న్యూఢిల్లీ : పీకెఎల్7 ద్వితీయార్థంలో పుంజుకున్న తెలుగు టైటాన్స్, ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసింది. డిఫెన్స్లో విశాల్ భరద్వాజ్, సి. అరుణ్, ఫర్హద్, అబోజర్లు సమష్టిగా రాణించటంతో పీకెఎల్ మ్యాచ్ ప్రథమార్థంలోనే 12 ట్యాకిల్ పాయింట్లు సాధించిన తొలి జట్టుగా తెలుగు టైటాన్స్ నిలిచింది. డిఫెండర్ల మెరుపులతో టైటాన్స్ 13-10తో ఆధిక్యంలో దూసుకుపోయింది. కానీ విరామ సమయానికి ముందు పుంజుకున్న పుణెరి పల్టన్ 17-14తో పైచేయి సాధించింది. ప్రథమార్థంలో స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశారు ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ద్వితీయార్థంలో తెలుగు టైటాన్స్ రైడింగ్లో పుంజుకున్నా.. డిఫెన్స్లో పట్టు తప్పింది. పుణె వరుస పాయింట్లతో ఆధిక్యం పెంచుకుంది. 34-27తో తెలుగు టైటాన్స్పై విజయం సాధించింది. డిఫెండర్లు సి. అరుణ్ 6 ట్యాకిల్స్, విశాల్ భరద్వాజ్ 5 ట్యాకిల్స్, ఫర్హద్ 2 ట్యాకిల్స్, అబోజర్ 2 ట్యాకిల్స్తో కదంతొక్కారు. సిద్దార్థ్ దేశారు ఏడు పాయింట్లు సాధించాడు. పుణె తరఫన మంజిత్ 9, నితిన్ తోమర్ 8 రైడింగ్లో రాణించారు. అమిత్ కుమార్, సాగర్ కృష్ట చెరో నాలుగు ట్యాకిల్స్ చేశారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 38-35తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. 34-24తో భారీ ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీని నిలువరించిన పట్నా.. 34-36తో వెంబడించింది. ఆధిక్యం నిలుపుకున్న ఢిల్లీ మూడు పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 15 పాయింట్లతో చెలరేగాడు. పట్నా స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 18 పాయింట్లతో రాణించినా, ఓటమి తప్పలేదు. పీకెఎల్7లో సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచుల్లో విజయాలు సాధించిన జట్టుగా దబంగ్ ఢిల్లీ నిలిచింది. నేడు బెంగళూర్లో జరుగనున్న మ్యాచ్లో బెంగళూర్ బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ తలపడనున్నాయి.