Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టుపై శాస్త్రి వివరణ
కింగ్స్టన్ : వెస్టిండీస్తో తొలి టెస్టుకు మ్యాచ్ విన్నర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కాదని లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి ఎంచుకున్నారు. దీనిపై రవిశాస్త్రి తాజాగా వివరణ ఇచ్చాడు. జడేజా ఇప్పుడు ఎంతో మెరుగైన ఆటగాడని శాస్త్రి కితాబిచ్చాడు. ' ప్రపంచంలో జడేజా అత్యుత్తమ ఫీల్డర్, ఇటీవల బ్యాటింగ్ను స్వర్గధామం చేసుకున్నాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. నార్త్సౌండ్, కింగ్స్టన్ పిచ్లపై ఆశించిన టర్న్ లభించదని , జడేజాను ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం. తేమతో కూడిన పిచ్పై తన పేస్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలడు జడేజా. అందుకే ప్రపంచ శ్రేణి స్పిన్నర్ అశ్విన్ను కాదని జడేజాను తీసుకున్నాం.