Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో 7-0తో నేపాల్పై గెలుపు
కోల్కత : భారత ఫుట్బాల్ వర్థమాన స్టార్లు చెలరేగారు. దక్షిణాసియా ఫుట్బాల్ అసోసియేషన్ (ఎస్ఏఎఫ్ఎఫ్) అండర్-15 చాంపియషిప్స్ ఫైనల్లో టీమ్ ఇండియా కుర్రాళ్లు ఘన విజయం సాధించారు. టైటిల్ పోరులో నేపాల్ను చిత్తుగా ఓడించారు. 7-0తో తిరుగులేని చాంపియన్గా నిలిచారు. కోల్కతలోని కళ్యాణి స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత కుర్రాళ్లు తొలి నుంచీ ఎదురుదాడి చేశారు. సిద్దార్థ్ 51, 76, 80 నిమిషాల్లో గోల్స్తో హ్యాట్రిక్ కొట్టాడు. మహేసన్ సింగ్ (15), అమన్దీప్ (42), సిబజిత్ సింగ్ (45), హిమాన్షు జాంగ్ర (65) గోల్స్తో మెరిశారు. 2013, 2017 తర్వాత భారత్ మూడోసారి దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్గా అవతరించింది. ' చాంపియన్స్గా నిలువటం సంతోషంగా ఉంది. విజయ లక్ష్యంతోనే ఇక్కడికొచ్చాం. సరైన సన్నద్ధతతో సాధించాం. ఆసియా ఫుట్బాల్ చాంపియన్షిప్స్ క్వాలిఫయర్స్కు ఇది సన్నాహకం. ఈ విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిం ది' అని కోచ్ బిబియానో ఫెర్నాండేజ్ అన్నాడు.