Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23-32తో గుజరాత్ చేతిలో ఓటమి
- జైపూర్ను చిత్తు చేసిన యు ముంబా
- ప్రొ కబడ్డీ లీగ్ 7 సీజన్
బెంగళూర్ : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో సొంతగడ్డపై పరాజయాల పరంపరకు దబంగ్ ఢిల్లీ చరమగీతం పాడినా.. బెంగళూర్తో పరాభవాల ప్రస్థానం మళ్లీ మొదలైంది!. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్ శనివారం కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడింది. 40 నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ ఏ దశలోనూ గుజరాత్ కంటే మెరుగ్గా కనిపించలేదు. డిఫెన్స్లో బెంగళూర్, గుజరాత్ చెరో 13 ట్యాకిల్స్ చేసినా.. బెంగళూర్ను రెండు సార్లు ఆలౌట్ చేసిన గుజరాత్ అదనంగా నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రైడింగ్లోనూ బెంగళూర్ (9) కంటే రెండు పాయింట్లు అదనంగా సాధించింది. మరో నాలుగు అదనపు పాయింట్ల అండతో గుజరాత్ 32-23తో ఆతిథ్య జట్టుపై అలవోక విజయం సాధించింది. విరామ సమయానికి 18-12తో ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన గుజరాత్.. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించింది. బెంగళూర్ కెప్టెన్, స్టార్ రైడర్ రోహిత్ కుమార్ విఫలమయ్యాడు. 16 రైడ్లలో మూడు పాయింట్లే సాధించాడు. యువ సంచలనం పవన్ షెరావత్ సైతం నిరాశపరిచాడు. 11 సార్లు కూతకెళ్లిన పవన్ కేవలం మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. పవన్ షెరావత్ను గుజరాత్ డిఫెండర్లు ఐదుసార్లు పట్టేశారు. బుల్స్ డిఫెండర్ సౌరభ్ నందల్ 8 ట్యాకిల్ పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో డిఫెండర్ మహేందర్ సింగ్ నాలుగు ట్యాకిల్స్ చేశాడు. గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్ సమష్టిగా రాణించింది. సచిన్ (5), మోరె (5), పర్వేశ్ (4), రోహిత్ గులియా (4), సునీల్ కుమార్ (3) రాణించారు. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు విజయాలు సాధించిన గుజరాత్, తర్వాత ఆరు ఓటములు చవిచూసింది. విజయాల బాట పట్టిన గుజరాత్కు ఓటముల తర్వాత ఇది రెండో విజయం.
మాజీ చాంపియన్లు తలపడిన మరో మ్యాచ్లో యు ముంబా తిరుగులేని విజయం సాధించింది. సీజన్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న జైపూర్ పింక్ పాంథర్స్కు ముంబా బెంగళూర్లో గట్టి షాకిచ్చింది. జైపూర్ను నాలుగు పర్యాయాలు ఆలౌట్ చేసిన యు ముంబా ప్రథమార్థంలో 23-7తో భారీ ఆధిక్యం సాధించింది. యు ముంబా రైడింగ్లో, డిఫెన్స్లో విశ్వరూపం చూపించింది. అభిషేక్ సింగ్ 13 రైడ్ పాయింట్లు సాధించగా, అర్జున్ దేశావల్ ఆరు పాయింట్లు సాధించాడు. డిఫెండర్ ఫజల్ అట్రచలి ఆరు ట్యాకిల్స్తో మెరువగా, హరేంద్ర కుమార్ ఐదు ట్యాకిల్స్తో ఆకట్టుకున్నాడు. సందీప్ నర్వాల్ నాలుగు పాయింట్లతో రాణించాడు. జైపూర్ సమష్టిగా విఫలమైంది. నితిన్ రావల్ (5), దీపక్ హుడా (3), అమిత్ హుడా (3), సందీప్ దుల్ (3) అవసరాల మేరకు పాయింట్లు సాధించలేదు. పీకెఎల్ 7లో నేడు బెంగళూర్ బుల్స్, తమిళ తలైవాస్ తలపడనుండగా.. మరో మ్యాచ్లో యూపీ యోధ, బెంగాల్ వారియర్స్ ఢకొీట్టనున్నాయి.