Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టాప్కు చేరాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్లో స్మిత్ 904 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానానికి చేరుకోగా.. కోహ్లి 903 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్లో భాగంగా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కోహ్లి డకౌట్ కావడంతో కోహ్లీ అగ్రస్థానం చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇక మూడోస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(878) నిలవగా... చతేశ్వర పుజారా(825) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో సిరీస్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా(835 పాయింట్లు) ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. పాట్ కమ్మిన్స్(ఆస్ట్రేలియా) 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... రబడా (దక్షిణాఫ్రికా) 851 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా(389 పాయింట్లు) నాల్గోస్థానానికి చేరాడు. టాప్లో హోల్డర్(వెస్టిండీస్-472 పాయింట్లు), రెండోస్థానంలో బెన్ స్టోక్స్(ఇంగ్లండ్-411), షకీబ్ (బంగ్లాదేశ్-399) మూడోస్థానంలో కొనసాగుతున్నారు.