Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పోటీలు
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడి మను బాకర్-సౌరభ్ చౌధురిలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియో డి జనీరో పర్యటనను స్వర్ణంతో భారత్ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తంగా ఐదు స్వర్ణ, రెండు రజత, మరో రెండు కాంస్య పతకాలను గెల్చుకున్నట్లయ్యింది. ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికల్లో జరిగిన నాలుగు ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్కప్ ఈవెంట్లలోనూ భారత్ టాప్ను దక్కించుకుంది. మను బాకర్-సౌరభ్ చౌదరిలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్-అభిషేక్ వర్మలపై పై చేయి సాధించారు. మను బాకర్-సౌరవ్లు 17-15 తేడాతో యశస్విని-అభిషేక్లపై విజయం సాధించి పసిడి కైవసం చేసుకున్నారు.