Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సంజయ్ బంగర్ను బ్యాటింగ్ కోచ్గా తప్పించడంతో అతడు దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలిసింది. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడానికి మొగ్గు చూపిన సమయంలో బంగర్ కాస్త అతి చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడట. తన మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారంటూ బంగర్ దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. సంజయ్ బంగర్కు మరోసారి అవకాశం ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి. టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని నియమిస్తూ కపిల్దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకోగా, సహాయక సిబ్బందిని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.