Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రొ కబడ్డీ పోటీల్లో భాగంగా గురువారం పుణేరి పల్టన్స్-యు ముంబ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యా టైగా ముగిసింది. ఇరుజట్టు నిర్ణీత సమయానికి 33-33తో సమంగా నిలిచాయి. పుణేరి జట్టులో మంజీత్ ఆల్రౌండ్ ప్రతిభతో 10 పాయింట్లు సంపాదించగా... పంకజ్(5) రైడ్లలో, జాధవ్(3) ట్యాకిల్స్లో మెరిసారు. ఇక యు ముంబ జట్టులో అభిషేక్ సింగ్(11) రైడ్ పాయింట్లను సంపాదించగా... ఫజల్ అత్రఛెలి(3), సురీందర్సింగ్(2) ట్యాకిల్లో రాణించారు. పుణేరి జట్టు 12 పాయింట్లను రైడ్ల ద్వారా సంపాదించగా... యు ముంబ 18 పాయింట్లను గెల్చుకుంది. కానీ ట్యాకిల్లో ఇరుజట్లు 12, 11 పాయింట్లతో సంమగా నిలిచాయి. కానీ పుణేరి జట్టు 4సార్లు యు ముంబ జట్టు రెండుసార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్ చేశాయి. నేడు పట్నా పైరెట్స్-యుపి యోథా, బెంగళూరు బుల్స్-తెలుగు టైటాన్స్ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి.