Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వెస్టిండీస్ టూర్ టెస్టుల్లో ఓపెనర్గా దిగిన మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్లు నిరాశపర్చడంతో రోహిత్ శర్మను ఓపెనర్గా బరిలో దింపాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐని కోరాడు. మయాంక్ అగర్వాల్ ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే ఆకట్టుకున్నాడని, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కానీ మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారి అద్భుతంగా ఆడారని, ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నాడు. ప్రపంచకప్లో రోహిత్శర్మ 9 మ్యాచుల్లోనే ఐదు శతకాలతో 648 పరుగుల అద్బుత ప్రదర్శనను ఎవరు మర్చిపోలేరు అని తెలిపాడు. విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ స్థానం ఆశించాడని, కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా బెంచ్కు పరిమితం చేయడం తనకు నచ్చలేదని గంగూలీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు.