Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు టైటాన్స్కు మరో ఓటమి
బెంగళూరు : ప్రొ కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. శుక్రవారం బెంగళూరు బుల్స్ చేతిలో 40-39తో ఓటమిపాలైంది. చివరి 4 నిమిషాల వ్యవధిలో 10 పాయింట్ల ఆధిక్యతను సంపాదించిన బెంగళూరు ఆ తర్వాత ఒక పాయింట్ తేడాతో మాత్రమే గెలుపొందడం విశేషం. బెంగళూరు బుల్స్ రైడర్ పవన్కుమార్(23) రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ కుమార్(5) ఫర్వాలేదనిపించాడు. రైడ్లలో బెంగళూరు 29, టైటాన్స్ 28 పాయింట్లను సంపాదించుకున్నా... ట్యాకిల్స్లో టైటాన్స్ నిరుత్సాహపరిచింది. అంతేగాక బెంగళూరు జట్టు నాలుగుసార్లు టైటాన్స్ను ఆలౌట్ కూడా చేయగల్గింది. ఇక టైటాన్స్ జట్టులో సిద్ధార్ధ్ దేశారు(23) ఒంటరి పోరాటం చేశాడు. విశాల్ భరద్వాజ్, అరుణ్, దలాల్ ట్యాకిల్స్లో నిరుత్సాహపరిచారు. మరో మ్యాచ్లో యుపి యోథా జట్టు 41-29తో పట్నా పైరెట్స్ను చిత్తుచేసింది. యోథా జట్టు ఆరుసార్లు పట్నాను ఆలౌట్ చేయడమేగాకుండా 14 ట్యాకిల్ పాయింట్లను సంపాదించింది. పట్నా జట్టులో పర్దీప్ నర్వాల్(14) ఒక్కడే రాణించాడు. నేటితో బెంగళూరు వేదికగా ప్రొ కబడ్డీ పోటీలు ముగిశాయి. శనివారంనుంచి కోల్కతా వేదికగా పోటీలు జరగనున్నాయి. నేడు బెంగాల్ వారియర్స్-గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్, దబాంగ్ ఢిల్లీ-హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి.