Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చోట్టాగ్రామ్: ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ టెస్టు కెరీర్కు ముగింపు పలకనున్నాడు. కెరీర్లో కేవలం మూడు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన నబీ ఎర్రబంతి క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత నబీ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్తో ఆడుతున్న జట్టులో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన నబీ ఇక టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ టీమ్ మేనేజర్ నజీమ్ జర్ అబ్దుర్రాహీమ్ జరు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా సెంచరీ చేయగా, అస్గర్ అఫ్గాన్(92) తృటిలో శతకం కోల్పోయాడు.