Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోని రిటైర్మెంట్పై గురువారం ఊహాగానాలు చెలరేగాయి. భారత టెస్టు జట్టు ఎంపికకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ మహి వీడ్కోలు వార్తలకు ఊతమిచ్చింది. 2016 టీ20 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయానంతరం ఫోటోను పంచుకున్న కోహ్లి.. 'ఆ మ్యాచ్ను ఎప్పటికీ మరువలేను. ప్రత్యేకమైన రాత్రి. ఈ మ్యాన్ (ధోని) నన్ను ఫిట్నెస్ పరీక్షలో పరుగెత్తించినట్టు చేశాడు' అని రాసుకొచ్చాడు. ధోని తన నిర్ణయాన్ని జట్టు మేనేజ్మెంట్కు తెలిపటంతో, కోహ్లి ఈ విధంగా ట్వీట్ చేశాడని అభిమానులు అనుకున్నారు. ధోని వీడ్కోలుపై ఎటువంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించటంతో వీడ్కోలు ఊహాగానాలకు తెరపడింది.