Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక స్టార్స్పై అక్తర్ వ్యాఖ్యలు
కరాచీ : పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సిరీస్కు పది మంది కీలక శ్రీలంక ఆటగాళ్లు దూరం కావటంపై రావల్సిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తపరిచాడు. కష్టకాలంలో శ్రీలంక క్రికెటర్లు పాకిస్థాన్కు అండగా నిలవాలని కోరాడు. ఈ మేరకు అక్తర్ ట్వీట్ చేశాడు. ' పది మంది శ్రీలంక క్రికెటర్లు పాక్ పర్యటనకు దూరం కావటం నిరాశ కలిగించింది. శ్రీలంక క్రికెట్కు పాకిస్థాన్ ఎల్లవేళలా సహాయకారిగా నిలిచింది. ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ దాడుల వెంటనే పాక్ అండర్-19 జట్టును కొలంబోకు పంపించింది. 1996 ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్లు లంకలో పర్యటించేందుకు విముఖత చూపిన సమయంలోనూ భారత్తో కలిసి సంయుక్త జట్టును శ్రీలంకకు పంపించింది. శ్రీలంక నుంచి పాకిస్థాన్ సైతం ఇదే ఆశిస్తోంది. బోర్డు సహకరిస్తున్నా, ఆటగాళ్ల తోడ్పాటు అవసరం' అని అక్తర్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో సిరీస్కు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీ నిలబెట్టుకున్నాడు. నూతన హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్తాఉల్ హాక్, పీసీబీ క్రికెట్ కమిటీ సూచనతో సర్ఫరాజ్ను కెప్టెన్గా కొనసాగించారు. స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యాడు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ ఈషన్ మణి ఆమోద ముద్ర వేశారు. పూర్తి జట్టును ఈ నెల 23న ఎంపిక చేయనున్నారు.