Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్
నూర్ సుల్తాన్ : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో భారత్కు తొలి రోజు తీవ్ర నిరాశే ఎదురైంది. శనివారం ఆరంభమైన పురుషుల గ్రీకో-రోమన్ పోటీల్లో భారత రెజ్లరు విఫలమయ్యారు. నాన్ ఒలింపిక్ విభాగాల్లో పోటీపడిన ఆసియా చాంపియన్షిప్స్ రజత పతక విజేత హర్ప్రీత్ సింగ్, సాగర్, మంజిత్లు బౌట్లో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. 72 కేజీల విభాగంలో యోగేశ్ అమెరికా ప్రత్యర్థి అంటోనిని నిలువరించే ప్రయత్నం చేశాడు. 5-6తో తృటిలో విజయానికి దూరమయ్యాడు. 82 కేజీల విభాగంలో హర్ప్రీత్ సింగ్, 63 కేజీల విభాగంలో సాగర్, 55 కేజీల విభాగంలో మంజిత్లు మట్టికరిచారు. భారత రెజ్లర్లపై తొలి రౌండ్లో గెలుపొందిన రెజ్లర్లు ఫైనల్స్కు చేరితే, మనోళ్లకు రిపిచేజ్ రూపంలో మరో అవకాశం లభించనుంది.