Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ బ్యాటింగ్ కోచ్ బంగర్
న్యూఢిల్లీ : వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా టెస్టు జట్టులో చోటు సాధించినా, రెండు టెస్టుల్లోనూ తుది జట్టులో నిలువలేదు రోహిత్ శర్మ. మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానె, హనుమ విహారిలతో పోటీపడినా బెంచ్కు పరిమితమయ్యాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు రోహిత్ శర్మను ఓపెనర్గా పరీక్షించాలని జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ నిర్ణయించాం. ఈ నేపథ్యంలో తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజరు బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' టెస్టుల్లో ఓపెనర్గా రోహిత్ శర్మ విజయవంతమైతే, అతడి తరహా శైలి జట్టుకు ఎంతగానో ఉపయుక్తం. కేప్టౌన్, ఎడ్జ్బాస్టన్లో మనకు సాధ్యపడని భారీ లక్ష్యాలను ఛేదించటంలో రోహిత్ శర్మ కీలకం అవుతాడు. ప్రస్తుతానికి మిడిల్ ఆర్డర్లో చోటు లేదు. ఓపెనర్ పాత్ర రోహిత్కు సవాల్. ఐదు రోజుల ఆటలో రోహిత్కు ఇది కొత్త అవతారమే. బ్యాట్స్మన్గా వ్యక్తిగత శైలికి కట్టుబడి ఉంటే ఓపెనర్గా రోహిత్ సక్సెస్ సాధిస్తాడు. సులువుగా ఖాళీల్లోకి బంతిని పంపటం రోహిత్ శర్మ బలం. బ్యాటింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇక ఉండదు. మానసికంగా ఇది మేలు చేస్తుంది' అని బంగర్ అన్నారు.