Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్
ఎక్టేరిన్బర్గ్(రష్యా) : ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన కవిందర్ బిస్త్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. శనివారం జరిగిన 57కిలోల బాక్సింగ్ రెండోరౌండ్ పోటీలో బిస్త్ చైనాకు చెందిన ఛెనా జిహావోపై 3-2 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గెలుపుతో బిస్త్ ప్రి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 5వ సీడ్గా బరిలోకి దిగిన 26ఏండ్ల బిస్త్ 2017లో హాంబర్గ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో క్వార్టర్ఫైనల్వరకు చేరుకున్నాడు. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్కు చెందిన అమిత్ పంగల్(52 కిలోలు), మనీష్ కౌశిక్(63 కిలోలు) ప్రత్యర్థులపై గెలిచి ప్రి క్వార్టర్స్ బెర్త్లు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక భారత్కు చెందిన ఎనిమిదిమంది (52, 57, 63, 69, 75, 81, 91, 91కు పైబడి) బాక్సర్లు 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు కూడా.