Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోచిమిన్సిటీ: భారత్ షట్లర్ సౌరభ్ వర్మ వియత్నాం ఓపెన్ సూపర్-100 సిరీస్ టైటిల్ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సౌరభ్ వర్మ 21-12,17-21, 21-14 తేడాతో సన్-ఫి-యింగ్ (చైనా)పై విజయం సాధించాడు. హోరాహోరిగా జరిగిన మ్యాచ్లో తొలి సెట్ను 21-12తో సౌరభ్ వర్మ తేలికగా గెలుపొందాడు. రెండో సెట్లో పుంజుకున్న సన్ 17-21తో పైచేయి సాధించాడు. నిర్ణయాత్మక ఆఖరి సెట్లో మళ్లీ సౌరభ్ తన ఫామ్ను కొనసాగిస్తూ సుదీర్ఘ ర్యాలీలతో అధ్యంతం అకట్టుకునే విధంగా ఆటను సాగింది. మూడో గేమ్ ఆరంభంలో ఇరువురు 6-6తో సమంగా నిలిచిన సమయంలో సౌరభ్ వర్మ విజంభించి ఆడాడు. తన ఆధిపత్యాన్ని చివరి పాయింట్ వరకు కాపాడుకుంటూ సౌరభ్ వర్మ సెట్తో పాటు మ్యాచ్ను ముగించడం విశేషం.