Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణే: ప్రొ కబడ్డీ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో దబాంగ్ ఢిల్లీ, పట్న పైరెట్స్ విజయాలను నమోదు చేసుకున్నాయి. హోరాహోరీగా సాగిన తొలి పోరులో దబాంగ్ ఢిల్లీ జట్టు 34-30 పాయింట్ల తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ను చిత్తుచేసింది. రైడ్లద్వారా ఇరుజట్లు 19 పాయింట్లు గెల్చుకున్నా... ట్యాకిల్స్లో ఢిల్లీ 10 పాయింట్లు సాధించడంతోపాటు నాలుగుసార్లు గుజరాత్ను ఆలౌట్ కూడా చేయగలిగింది. గుజరాత్ రైడర్ రోహిత్(13) రాణించగా.. సచిన్(4) నిరాశపరిచాడు. ఇక ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్(12) సత్తా చాటగా.. విశాల్(3), జోగిందర్(3) ట్యాకిల్స్లో మెరిశారు. ఏకపక్షంగా జరిగిన మరో పోరులో పట్నా జట్టు 55-33తో పుణేరి పల్టన్స్ను చిత్తు చేసింది. పట్న రైడర్ పర్దీప్ నర్వాల్(18) రైడ్లలో శివాలెత్తాడు. నీరజ్కుమార్(11) ట్యాకిల్స్లో రాణించగా.. ఒస్టోరక్(5), మోను(4) ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచారు. రైడ్లలో పుణేరి 25, పట్న 26 పాయింట్లు సాధించినా.. ట్యాకిల్స్లో పట్నా(18) సత్తా చాటింది. అంతేగాక ఎనిమిదిసార్లు పుణేరిని ఆలౌట్కూడా చేసి ప్రత్యర్ధి ఆటగాళ్లను గుక్క తిప్పుకోకుండా చేసింది. నేడు జైపూర్-యూపీ, తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి.