Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సైనా నెహ్వాల్ సైతం
- నేటి నుంచి చైనా ఓపెన్
బీజింగ్: బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్ పసిడి స్వప్నం సాకారం చేసిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు తాజాగా చైనా ఓపెన్పై కన్నేసింది. వరుసగా మూడో ప్రయత్నంలో వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం అందుకున్న సింధు నేటి నుంచి ఆరంభం కానున్న చైనా ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ నం.5 సింధు ఒలింపిక్స్కు ముందు టాప్-2 ర్యాంక్పై గురి పెట్టింది. టోక్యోలో ఆరంభ రౌండ్లలో సులువైన డ్రా కోసం టాప్-2 అనివార్యం. దీంతో చైనా ఓపెన్ను సింధు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహిళల సింగిల్స్ డ్రాలో సింధు, సైనా ఒకే పార్శ్యంలో చోటుచేసుకున్నారు. ఇద్దరూ క్వార్టర్స్ వరకూ విజయాలు సాధిస్తే సెమీఫైనల్లో ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. తొలి రౌండ్లో సింధుకు మాజీ వరల్డ నం.1, మాజీ ఒలింపిక్ చాంపియన్ జురేరు ఎదురు కానుంది. వరుస గాయాలతో జురేరు ఇప్పుడు కోరల్లేని ప్రత్యర్థి. సూపర్ ఫామ్లో ఉన్న సింధుకు జురేరు ఏమాత్రం గట్టి పోటీదారు కాదు. 2012 ఒలింపిక్ విజయానంతరం, జురేరుపై విజయంతోనే సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ వెలుగులోకి వచ్చింది. రెండో రౌండ్లో కెనడా షట్లర్ మిచెలీ లీ ఎదురు కానుంది. క్వార్టర్ఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ చెన్ యుఫెరు సవాల్ విసిరే చాన్స్ ఉంది. మరో వైపు సైనా నెహ్వాల్కు క్వార్టర్ వరకూ గట్టి పోటీ లేదు. కానీ క్వార్టర్స్లో కఠిన ప్రత్యర్థి మాజీ వరల్డ్ నం.1 తైజుయింగ్ (చైనీస్ తైపీ) ఎదురు కానుంది. క్వార్టర్స్లో తైజును జయిస్తే, సెమీస్లో సింధుతో తలపడేందుకు సైనా రంగం సిద్ధం చేసుకున్నట్టే. చైనా షట్లర్లు కెరీర్ ఫామ్లో ఉండగా 2014లో చైనా ఓపెన్ను సాధించిన సైనా నెహ్వాల్, ఆ విజయంతో మహి ళల సింగిల్స్లో డ్రాగన్ ఆధిప త్యాన్ని అదికారికంగా గండి కొట్టింది. గాయాలతో పోరా టం చేస్తూ మెరుగైన విజయం కోసం ఎదురుచూస్తున్న సైనా నెహ్వాల్ అచ్చొచ్చిన చైనాలో మెరస్తుందేమో చూడాలి.
పురుషుల సింగిల్స్ మాజీ చాంపియన్ కిదాంబి శ్రీకాంత్ ఆఖరు నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. శ్రీకాంత్, సమీర్ వర్మలు గాయాలతో వైదొలగగా.. హెచ్.ఎస్ ప్రణరు డెంగ్యూతో పోటీకి దూరమయ్యాడు. ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సాయిప్రణీత్, సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మెన్స్ విభాగంలో పోరాడనున్నారు. డబుల్స్లో థారులాండ్ ఓపెన్ విజేతలు సాత్విక్రెడ్డి, చిరాగ్ శెట్టిలు ఉత్సాహంతో సిద్దమవుతున్నారు. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప జంటకు మరోసారి కఠినమైన డ్రా ఎదురైంది.