Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఓపెన్ బ్యాడ్మింటన్
బీజింగ్ : ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మంగళవారం డబుల్స్ విభాగాల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. థాయ్ లాండ్ ఓపెన్ విజేతలు సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. 21-7, 21-18తో కెనడా జోడీపై 30 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించారు. మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సాత్విక్సాయిరాజ్ జంట మూడు గేముల మ్యాచ్లో గెలిచింది. ఇండోనేషియా జోడీ, ఆరో సీడ్ ప్రవీణ్, మెలాటిలపై 22-20, 17-21, 21-17తో మెరుపు విజయం సాధించారు.
మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ పి.వి సింధు నేడు టైటిల్ వేట మొదలెట్టనుంది. తొలి రౌండ్లో మాజీ వరల్డ్ నం.1 లీ జురేరు (చైనా)తో సింధు తలపడనుంది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్లో థాయ్ లాండ్ షట్లర్ బుసానన్ను ఢకొీట్టనుంది. ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించి, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సరసన నిలిచిన సాయిప్రణీత్ తొలి రౌండ్లో థాయ్ లాండ్ ఆటగాడు సుప్పన్యుతో తలపడనున్నాడు.