Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయం నుంచి కోలుకోని జిమ్నాస్ట్
న్యూఢిల్లీ : భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ 2020 టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరినట్టే!. అక్టోబర్లో జర్మనీలో జరిగే వరల్డ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్స్కు ఎంపిక చేసిన భారత బృందంలో దీప కర్మాకర్ లేకుండా పోయింది. వివాదాల సుడిగుండంలో నడుస్తున్న భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య వరల్డ్ చాంపియన్షిప్స్ సెలక్షన్ ట్రయల్స్ కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం ట్రయల్స్ నిర్వహించి, ఆరుగురు అథ్లెట్లను ఎంపిక చేసింది. సారు, జిమ్నాస్ట్ సంఘం తీరుపై దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది మండిపడ్డారు. ' సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించేది ఇలాగేనా? శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తే, అగర్తలలో సాధన చేస్తున్న అథ్లెట్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో ట్రయల్స్కు ఏ విధంగా హాజరు కాగలదు?' అని నంది ప్రశ్నించారు. దీప కర్మాకర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతోంది. అగర్తలలోనే నంది పర్యవేక్షణలో దీప సాధన కొనసాగుతుంది. జర్మనీ వరల్డ్ చాంపియన్షిప్స్కు దూరం కావటంతో మిగిలిన మూడు ప్రపంచకప్లలో దీప కర్మాకర్ స్వర్ణాలు సాధిస్తే ఒలింపిక్స్కు అర్హత సాధించనుంది. వాస్తవికంగా దీపకు టోక్యో ఒలింపిక్స్ ఆశలు లేవు. 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం దీప కర్మాకర్ను సిద్ధం చేస్తానని నంది విశ్వాసం వెలిబుచ్చాడు. రియో ఒలింపిక్స్లో దీప కర్మాకర్ నాల్గో స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయిన సంగతి తెలిసిందే.